సరిహద్దులో బంగ్లా సైన్యం-భారత్ అప్రమత్తం
గౌహతిః భారత సరిహద్దు దళాలు మంగళవారం అప్రమత్తం అయ్యాయి. బంగ్లాదేశ్ బలగాలు సరిహద్దు వెంటపెద్ద ఎత్తున మొహరించడంతో భారత సరిహద్దు దళాలు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సమాయత్తం అవుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి బంగ్లాదేశ్ బలగాలు సరిహద్దు వెంట హఠాత్తుగా మొహరించడం ప్రారంమైంది.అస్సాం. త్రిపుర, మిజోరం రాష్ట్రాలలోని బంగ్లాదేశ్ సరిహద్దు వెంట బంగ్లాసైనికుల కదలికలు తీవ్రమయ్యాయని సరిహద్దు భద్రతాదళాల ఐ.జి.అరవింద్ రంజన్ మంగళవారం ప్రకటించారు.
సరిహద్దు
వెంట
ఉద్రిక్తత
నెలకొన్నదని
ఆయనఅగర్తల
నుంచి
టెలిఫోన్
ద్వారా
విలేకరులకు
చెప్పారు.
గత
వారంలో
భారత
సరిహద్దు
భద్రాతా
దళాలను
బంగ్లాసైనికులు
అమానుషంగా
హింసించి
చంపిన
నాటి
నుంచి
ఇరుదేశాల
మధ్య
ఉద్రిక్త
వాతావరణం
నెలకొంది.
బంగ్లాదేశ్
చర్యను
భారత
ప్రధాని
వాజ్పేయి
తీవ్రంగా
పరిగణించి,
ఆ
దేశ
ప్రధాని
షేక్
హసీనాకుస్వయంగా
నిరసన
వ్యక్తం
చేశారు.
ఆమె
కూడా
జరిగిన
సంఘటన
పట్లవిచారం
వ్యక్తం
చేశారు.
తాజాగా
సరిహద్దు
వెంట
బంగ్లా
దళాలు
మొహరించడం
పట్లసర్వత్రా
ఆందోళన
వ్యక్తం
అవుతున్నది.