జయ నామినేషన్ల తిరస్కృతి
చెన్నై: తమిళనాడుఅసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలనుకున్నఅన్నాడియంకె అధినేత్రి జయలలితకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె వేసిన రెండు నామినేషన్లు తిరస్కరణకుగురయ్యాయి. అండిపట్టి, కృష్ణగిరి నియోజకవర్గాల్లో ఆమెనామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు నామినేషన్లను కూడా రిటర్నింగ్అధికారులు తిరస్కరించారు. వీటితో పాటు సోమవారందాఖలు చేసిన జయలలిత మరో రెండు నామినేషన్లను కూడా రిటర్నింగ్అధికారులు తిరస్కరించారు. భువనగిరి, పొదుకొట్టాయ్లలో కూడా ఆమెనామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
దీంతో ఆమె అసెంబ్లీఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండాపోయింది. 1997 నియమావళి ప్రకారం రెండేళ్లు, ఆ పైబడి శిక్ష పడినవ్యక్తులు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు.టాన్సీ భూముల కేసులో జయలలితకుమూడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ఆమెఎన్నికల్లో పోటీకి అనర్హురాలయ్యారు.
కృష్ణగిరిలో నామినేషన్ తిరస్కరణతో తీవ్రఉద్రిక్తత నెలకొంది. అన్నాడియంకె నాయకులు, కార్యకర్తలు రోడ్లమీదికి వచ్చారు. పరిస్థితిని ముందే ఊహించిన ప్రభుత్వంమంగళవారం ఉదయం నుంచే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేసింది.