వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాక్‌ స్కామ్‌పైజెపిసి: సిన్హా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్టాక్‌ కుంభకోణంపైసంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటుకు ప్రభుత్వంసంసిద్ధత వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌,తెలుగుదేశం పార్టీల దాడిని రాజ్యసభలోమంగళవారం ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా తిప్పికొడుతూ జెపిసికి ప్రభుత్వంసిద్ధంగానే వున్నదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిప్రమోద్‌ మహాజన్‌ ఇదివరకే చెప్పారని, ఇప్పుడు జెపిసిఏర్పాటుపై పార్లమెంట్‌ నిర్ణయం తీసుకోవాల్సి వున్నదనిఅన్నారు.

స్టాక్‌ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతున్నబ్రోకర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంకొనసాగిస్తుందని, సెన్సెక్స్‌ ఎంతగా పతనమైనా ఫరవాలేదని ఆయన అన్నారు. దోషులనుశిక్షించడమే తమకు కావాల్సిందని ఆయన అన్నారు.స్కామ్‌పై సెబీ నివేదిక లీక్‌ అయిందన్న కాంగ్రెస్‌ సభ్యుడుమన్మోహన్‌ సింగ్‌ ఆరోపణలను మంత్రిఖండించారు. లీకేజీల ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ పనిచేయదని, వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలకు ప్రభుత్వం బాధ్యతవహించదని ఆయన అన్నారు.

స్టాక్‌ బ్రోకర్ల కంపెనీలపైఆదాయం పన్ను శాఖ దాడులు నిర్వహించడంలో జాప్యంచేసిందన్న తెలుగుదేశం సభ్యుడు సి.రామచంద్రయ్య విమర్శను మంత్రి తోసిపుచ్చారు.దాడుల నిర్వహణకు ముందు ప్రాథమిక సాక్ష్యాధారాలసేకరణకు ఆదాయం పన్ను శాఖకు సమయం పడుతుందనిఆయన అన్నారు.

స్టాక్‌ కుంభకోణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పలుచర్యలకు శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు.సెబీకి మరిన్ని అధికారాలు ఇవ్వడంతో పాటు దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు యశ్వంత్‌సిన్హా చెప్పారు. స్టాక్‌ కుంభకోణంపై సెబీ ప్రాథమికనివేదికను మాత్రమే సమర్పించిందని,అవసరమైనప్పుడు దాన్ని సభ ముందుపెడుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X