వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌ప్రతిపాదనల్లో సవరింపులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బడ్జెట్‌ప్రతిపాదనల్లో ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా బుధవారంనాడు కొన్ని సవరింపులుప్రకటించారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని, వడ్డీఆదాయంపై పన్నును పెంచడంతో పాటు ప్రత్యక్ష, పరోక్షపన్నుల్లో ఆయన సవరింపులు చేశారు.

ఆదాయం పన్ను డిడక్షన్‌ఆదాయ పన్ను తగ్గింపును తాను ప్రతిపాదించినట్లుఆయన తెలిపారు. పన్ను చెల్లింపుదారులకుఉపయోగపడేలా పరిమితిని 12 వేల రూపాయలకు సవరించినట్లుఆయన తెలిపారు. వార్షికాదాయం లక్షన్నర ఉన్నవారికి డిడక్షన్‌ పరిమితిని 25 వేల నుంచి 30వేల రూపాయలకు పెంచినట్లు, లక్షన్నర నుంచి మూడు లక్షలరూపాయాల వార్షిక ఆదాయం వున్నవారికి డిడక్షన్‌ పరిమితిని 20వేల నుంచి 25 వేల రూపాయలకు పెంచినట్లుసిన్హా చెప్పారు. దీని వల్ల ప్రభుత్వంపై వేయి కోట్లరూపాయల భారం పడుతుంది.

ఎగుమతిదారులకు ప్రత్యక్షపన్నులపై రాయితీలు ప్రకటించారు. వీరు ఈ ఆర్థికసంవత్సరానికి గాను ఆదాయంలోని 40 శాతంపై పన్నుచెల్లించాల్సి వుంటుంది. వచ్చే మూడేళ్లు ఈ శాతంవరుసగా 60, 70, వంద శాతాలకు పెరుగుతాయి.

బ్రాండెడ్‌ దుస్తులపైవిధించిన 16 శాతం ఎక్సయిజ్‌ సుంకాన్ని అన్‌ బ్రాండెడ్‌దుస్తులపై కూడా విధిస్తూ సిన్హా ప్రతిపాదనలుచేశారు. ఈ సవరింపులు మే 1వ తేదీ నుంచిఅమల్లోకి వస్తాయి.

కార్ల, ద్విచక్ర వాహనాలయూనిట్లపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని సిన్హా 35 శాతంనుంచి 60 శాతానికి పెంచారు. ఐటి పరిశ్రమకు ఊపుఇవ్వడానికి ఐదు శాతం కస్టమ్స్‌ డ్యూటీపై ఎగుమతిచేసుకోవడానికి అనుమతించే యంత్రాల, పరికరాలజాబితాలో 32 ఐటమ్‌లను చేర్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X