పోటీ ఆశలేకున్నా ఆగని జయ ప్రచారహోరు
చెన్నయ్ః అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత కిం కర్తవ్యం దశలో వున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు జయను ఎన్నికల సంఘం అనర్హురాలిగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై జయ సుప్రీంకోర్టులోఅప్పీలు చేసుకొనే అవకాశం వుంది. శిక్ష పడినప్పటికీ ఆ శిక్ష అమలును హైకోర్టు సస్పెండ్ చేసినందున తాను పోటీ చేసేందుకుఇ.సి. అభ్యంతరం చెప్పక పోవచ్చని భావించిన జయలలిత ఆమె అనుచర గణం ఇప్పుడు ఎటూ పాలుపోని స్థితిలో పడింది.
తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా కరుణానిధి కుట్రపన్నారంటూ జయలలిత తీవ్రంగావిమర్శించారు. ఇంత ఎదురుదెబ్బ తగిలినా జయలలిత మాత్రం ముమ్మరంగా ప్రచారం సాగిస్తునే వున్నారు. చివరకు తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకున్న కరుణానిధిని మట్టికరిపించాలంటూ ఆమె ప్రజలకువిజ్ఞప్తి చేశారు. ఆమె సభలు ప్రజలు తండోప తండాలుగా రావడంవిశేషం.
జయ
నేస్తాలు
నోరువిప్పాలిః
బిజెపి
తమిళనాడులో
జయలలితతో
పొత్తుపెట్టుకున్న
కాంగ్రెస్
పార్టీకి
తాజా
పరిణామాలు
దిగ్భ్రాంతి
కలిగించాయి.
జయపై
ఆశతో
ఆమెతో
పోత్తుపెట్టుకున్న
కాంగ్రెస్
ఇప్పుడు
ఆమె
బరిలో
వుండే
అవకాశం
లేదని
తెలుసుకొని
ఎటూ
తోచని
పరిస్థితిని
ఎదుర్కొంటున్నది.
జయను
అడ్డుపెట్టుకొని
బిజెపి
మరోవైపు
కాంగ్రెస్
పార్టీపై
ధ్వజమెత్తింది.
తమిళనాడు
పరిణామాలపై
కాంగ్రెస్
పార్టీ
వైఖరి
ఏమిటో
తేల్చి
చెప్పాలని
కేంద్ర
గ్రామీణాభివృద్ధి
శాఖ
మంత్రిఎం.
వెంకయ్య
నాయుడు
డిమాండ్
చేశారు.
ఎన్నికల్లో
పోటీ
చేసేందుకు
కూడా
అర్హత
లేని
జయలలితతో
కాంగ్రెస్
ఇంకా
పొత్తుపెట్టుకుంటుందా
అని
ఆయన
ఎద్దేవా
చేశారు.
- .జయ నామినేషన్ల తిరస్కృతి
- జయ
అనుచరుల
విధ్వంసకాండ