దత్తతలపై కదిలివచ్చిన కారాబృందం
హైదరాబాద్ః దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆడశిశువుల అమ్మకాల వ్యవహారాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన దత్తత వ్యవహారాల నియంత్రణ సంస్థ(కారా) అధికారులు బుధవారం హైదరాబాద్చేరుకున్నారు.
కారా బృదంబుధవారం నాడు మాజీ మంత్రి రోడామిస్త్రీఆధ్వర్యంలో నడుస్తూవున్న దత్తత సంస్ధఐసిఎస్బ్ల్యూను తనిఖీ చేసింది. అయితే, తనిఖీవివరాలను తెలిపేందుకు మాత్రం కారా బృందంఅంగీకరించలేదు. తనిఖీ జరుగుతున్నసమయంలో సంస్ధ నిర్వాహకురాలు రోడామిస్త్రీవిలేకరులను అనుమతించలేదు.
ఆమె విలేకరులఎడల కఠినంగా వ్యవహరించారు. కారాబృందంస్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శాలినీమిశ్రాను కూడాకలిసింది. ఆపపిల్లల అమ్మకాలపై తాము రాష్ట్రప్రభుత్వంనుంచి నివేదిక తెప్పించుకుంటామని కారాబృందం తెలిసింది. కారాపై కూడాఆరోపణలువున్నాయన్న ప్రశ్నకు బృందం సమాధానంచెప్పేందుకు నిరాకరించింది. కారా బృందం రాష్ట్రంలోనిఐదు దత్తత బృందాలను తనిఖీ చేస్తుంది.
ఆంధ్ర రాష్ట్రంలో కారా చట్టాన్ని అడ్డంపెట్టుకొని జరుగుతున్న ఘోరాన్ని గురించి పూర్తి సమాచారాన్నిసేకరించి త్వరలో ఒక నివేదిక సమర్పించనున్నట్లు కారా డైరెక్టర్ జగన్నాథపతి చెప్పారు.