వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్పేయి ప్రభుత్వానికి మహానాడు హెచ్చరిక
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ తన సొంత ఎజెండా అమలు చేయటానికి ప్రయత్నిస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని వాజ్పేయి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలుగుదేశం మహానాడు తీర్మానించనుంది.
విశాఖపట్నంలో జరుగనున్న తెలుగుదేశం మహానాడులో ప్రతిపాదించే తీర్మానాలను రూపకల్పన కసరత్తు చేస్తున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ఎజెండానుంచి వాజ్పేయి ప్రభుత్వం వైదొలిగితే మద్దతు ఉపసంహరించుకోవటానికి ఏమాత్రం వెనుదీయబోమని మహానాడు స్పష్టం చేయనుంది.
తాము మద్దతు ఇస్తున్నది బిజెపి విధానాలకు కాదని, ఎన్డిఏ ఎజెండాకు మద్దతిస్తున్నామని మహానాడు తీర్మానాల కమిటి సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బుధవారం నాడు హైదరాబాద్లో స్పష్టం చేశారు.
Comments
Story first published: Wednesday, April 25, 2001, 23:53 [IST]