వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ అనుచరుల విధ్వంసకాండ

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః మే 10 నుంచి తమిళనాడుఅసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత పోటీ చేసేందుకు అనర్హురాలంటూ ఎన్నికల కమిషన్‌ అధికారులు స్పష్టం చేయడంతో ఆమె అనుచరులు ఆగ్రహంతో ఊగి పోయారు. మంగళవారం రాత్రి ఈవిషయం తెలిసిన వెంటనే అన్నాడిఎంకె కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. బస్సులపై రాళ్ళు రువ్వారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి దిష్టిబొమ్మలను తగలబెట్టారు. బుధవారం ఉదయం కూడా అన్నాడిఎంకె కార్యకర్తలు పలు చోట్ల విధ్వంసానికి పాల్పడినట్లు సమాచారంఅందింది.

తమ నాయకురాలని పోటీచేయకుండా అన్యాయంగా అడ్డుకున్నారని, చివరకు ధర్మమే జయిస్తుందని అన్నాడిఎంకె నేతలు వ్యాఖ్యానించారు. జయలలిత పోటీకి అనర్హురాలని ఎన్నికల సంఘం తేల్చి చెప్పడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఈ పరిణామాలు అన్నాడిఎంకెకు సానుభూతి ఓట్లు తెచ్చిపెట్టి ఎక్కడ తన కొంప ముంచుతుందో అని కరుణానిధి ఆందోళన పడుతున్నారు. అన్నాడిఎంకె కార్యకర్తల ఆగ్రహానికి మరిన్ని ఆస్తులు ధ్వంసం కాకుండా తమిళనాడు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X