కులవివక్షపై అఖిలపక్షం
హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న కులవైషమ్యాలు, అంటరానితనం తదితర సామాజిక రుగ్మతలపై ప్రభుత్వం త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ విషయం హోం మంత్రి దేవేందర్గౌడ్ గురువారం నాడు చెప్పారు. దళితలను దేవాలయాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్న సంఘటనలపై రాష్ట్ర కులవివక్ష వ్యతిరేక సంఘం గురువారం నాడు దేవేందర్గౌడ్ను కలసి ఫిర్యాదు చేసింది.
ఈ
సందర్భంగా
పోలీసులు
కూడా
అగ్రవర్ణాల
వారికి
సహకరిస్తూ
దళితులు
దేవాలయాల్లోకి
ప్రవేశించకుండా
నిరోధిస్తున్నారని
సంఘం
ప్రతినిధులు
హోం
మంత్రికి
తెలిపారు.
ఈ
విషయంపై
సమగ్ర
విచారణ
జరిపిస్తానని
హోం
మంత్రి
వారికి
హామీ
ఇచ్చారు.
త్వరలోనే
ఈ
కులవివక్ష,
ఇతర
సామాజిక
దురాచారాలను
రూపుమాపడానికి
తీసుకోవల్సిన
చర్యలపై
ప్రభుత్వం
అఖిలపక్ష
సమావేశం
ఏర్పాటు
చేసి
చర్చిస్తుందని
ఆయన
చెప్పారు.
ఇదిలా
వుండగా
డైరెక్టర్
జనరల్
ఆఫ్
పోలీసు
హెచ్జె
దొర
రాష్ట్రంలోని
అన్ని
జిల్లాల
ఎస్పిలకు
పంపిన
ఉత్తర్వుల్లో
దళితుల
దేవాలయ
ప్రవేశంపై
చెలరేగుతున్న
వివాదంపై
కన్నేసి
వుంచాల్సిందిగా
ఆదేశించారు.
సమస్యలు
తలెత్తిన
చోట
దళితుల
దేవాలయ
ప్రవేశానికి
అడ్డంకి
లేకుండా
చర్యలు
తీసుకోవాలని
సూచించారు.