కోర్టుకెక్కనున్నజయలలిత
మదురై : అసెంబ్లీఎన్నికల్లో పోటీ చేయడానికి వేసిన తన నామినేషన్లను తిరస్కరించడాన్నికోర్టులో సవాల్ చేయాలని అన్నాడియంకె అధినేత్రిజయలలిత నిర్ణయించుకున్నారు. శిక్ష పడిన బాలమురళి కృష్ణపిళ్లై నామినేషన్లను అనుమతించి తన నామినేషన్లనుతిరస్కరించడంలో గల న్యాయమేమిటని ఆమె అడుతున్నారు. సిట్టింగ్ శాసనసభ్యుడు కాబట్టిపిళ్లై నామినేషన్ అనుమతించామనిచెప్పడంలో అర్థం లేదని, న్యాయం అందరికీఒకే విధంగా వుండాలని ఆమె అన్నారు.
తన నామినేషన్లను తిరస్కరించమని ఎన్నికలఅధికారులను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధిబెదిరించాలని అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత తీవ్ర ఆరోపణచేశారు.
గురువారం ఆమె మధురైలో ఎన్నికల సభలో మాట్లాడుతూ కరుణానిధిబెదిరింపులవల్లే ఎన్నికల అధికారులు తననామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. తననామినేషన్లను తిరస్కరించిన అధికారులుశిక్షకుగురైన బాలకృష్ణ పిళ్లై నామినేషన్లనుఎందుకు తిరస్కరించలేదని ఆమె ప్రశ్నించారు. బాలకృష్ణపిళ్లై నామినేషన్లు తిరస్కరించకుండా తననామినేషన్లను తిరస్కరించటంలోనే ముఖ్యమంత్రి పాత్ర స్పష్టమవుతున్నదనిజయలలిత అన్నారు.