వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాక్‌ స్కామ్‌పై జెపిసి ఏర్పాటు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణంపై గురువారం ప్రభుత్వంసంయుక్త పార్లమెంటరీ కమిటి (జెపిసి)ని నియమించింది. ఈ కమిటీ తననివేదికను వర్షాకాలం పార్లమెంటు సమావేశాలుముగిసే లోగా తన నివేదికనుసమర్పిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిప్రమోద్‌ మహాజన్‌ చెప్పారు.

ఇదిలా వుంటే, పార్లమెంటు సమావేశాలను శుక్రవారంనిరవధికంగా వాయిదా వేయనున్నట్లు లోక్‌సభస్పీకర్‌ జి.ఎం.సి. బాలయోగి చెప్పారు. సమావేశాలువచ్చే నెల 11వ తేదీ వరకు జరగాల్సి వున్నప్పటికీఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లుఆయన చెప్పారు.

పార్లమెంటు సమావేశాలుముగుస్తున్నందున తెహెల్కా వివాదంపైసంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటుఅంశమే ఉత్పన్నం కాదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు అన్నారు. అయితే,తెహెల్కా వివాదంపై జెపిసి ఏర్పాటుకు తాముపోరాడుతామని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఎస్‌.జైపాల్‌ రెడ్డి చెప్పారు. జెపిసిని ఏర్పాటు చేస్తామని ఇచ్చినహామీని ప్రధాని వాజ్‌పేయి నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్లుఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X