వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెహల్కాకుతెరః పార్లమెంటు వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీఃపార్లమెంటు ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగావాయిదా పడ్డాయి. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలుమే మొదటి వారం వరకు జరగాల్సి వున్నప్పటికీఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నందునపార్లమెంటు సమావేశాలను ముందుగానే వాయిదావేయాలని నిర్ణయించారు. అయితే పార్లమెంటు సమావేశాలనుఈ సారి తెహల్కా సంక్షోభం పూర్తిగా స్తంభింపచేసింది. ఫిబ్రవరి నెలాఖరులో సాధారణబడ్జెట్‌, అంతకు రెండు రోజుల ముందు రైల్వేబడ్జెట్‌ ప్రవేశపెట్టడం మినహా ఈ సారి ఎటువంటికీలక బిల్లులు ఆమోదానికి నోచుకోలేదు.

మార్చి ప్రారంభం నుంచి తెహల్కా భూతంపార్లమెంటును స్తంభిప చేసింది. తెహల్కాపైజెపిసి ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వంఅంగీకరించడంతో రైల్వే బడ్జెట్‌ ఏ మాత్రంచర్చ లేకుండా, సాధారణ బడ్జెట్‌ మొక్కుబడిచర్చతో సభ ఆమోదం పొందాయి.

ఏరుదాటితెప్పతగలేసిన ప్రధాని ః కాంగ్రెస్‌
దేశవ్యాప్తంగా సంచలనంసృష్టించిన తెహల్కాపై జెపిసి ఏర్పాటు చేసేందుకుఅంగీకరించిన వాజ్‌ పేయి బడ్జెట్‌ ఆమోదం పొందినవెంటనే మాట మార్చారని కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది.బజ్డెట్‌ ఆమోదం పొందడతో ఏరుదాటాక తెప్పతగలేసినచందంగా జెపిసిపై ఇచ్చిన హామీని తుంగలోతొక్కారని కాంగ్రెస్‌ పార్టీ నిందించింది.

పార్లమెంటులో తెహల్కాపై కనీసం చర్చజరగకుండా ఎన్డీఏ సర్కార్‌ అడ్డుపడిందని కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి కపిల్‌ సిబార్‌ ఆరోపించారు.అయితే సభను అనవసరంగా స్తంభింపచేసితెహల్కాపై కనీసం చర్చ జరగకుండా కాంగ్రెస్‌పార్టీ అడ్డుకుందని భారతీయ జనతా పార్టీ ప్రత్యారోపణచేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X