వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రశేఖర్పై దేశంవిమర్శ
హైదరాబాద్ : తెలంగాణా వెనుకబాటు తనానికి తెలంగాణాకు చెందిన నాయకులే కారణమని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. డిప్యూటి స్పీకర్ చంద్రశేఖర్రావు తెలుగుదేశంపై విరుచుకుపడ్డ నేపథ్యంలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లాల్జాన్ బాషా స్పందించారు. తెలంగాణా ప్రాంతంనుంచి ఒక ప్రధాని, నలుగురు ముఖ్యమంత్రలు ఎన్నకయ్యారని, వీరందరి హయాంలోకన్నా తెలుగుదేశం హయాంలోనే తెలంగాణాలో అభివృద్ది అధికంగా జరిగిందని ఆయన అన్నారు.
డిప్యూటి స్పీకర్ చంద్రశేఖరరావుకు తెలుగుదేశం పార్టీ ఎన్నో ఉన్నతస్ధానాలు కల్పించిందని, అయినప్పటికీ ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారని ఆయన అన్నారు. చంద్రశేఖర్రావు సమర్పించిన రాజీనామాలపై పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటుందని లాల్జాన్ బాషా తెలిపారు.
Comments
Story first published: Friday, April 27, 2001, 23:53 [IST]