వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుట్రతోనే తహల్కోలో ఇరికించారు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దళితులు, మైనార్టీలను పెద్దఎత్తున బిజెపికి అనుకూలంగా సమీకరిస్తున్న కారణంగానే కుట్రపన్ని తహల్కా కేసులో తనను ఇరికించారని బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ ఆరోపించారు. శనివారం నాడు హైదరాబాద్‌లో ఒక ప్రైవెట్‌ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ, తహల్కా వ్యవహారం మొత్తం ఒక కుట్ర అని అన్నారు. జర్నలిస్టు నియమాలకు కూడా ఇది వ్యతిరేకమని ఆయన చెప్పారు.

తహల్కా లాంటి ఉదంతాలు జరిగితే ఎవరు జర్నలిస్టులో ఎవరు కాదో గుర్తించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధిష్టానవర్గం ఏ బాధ్యత అప్పగించినా తాను స్వీకరించడానికి సిద్ధంగా వున్నానని ఆయన చెప్పారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రానికి హామీ ఇచ్చి గత ఎన్నికల్లో బిజెపి ఓట్లు అడింగిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. చిన్న జిల్లాల ఏర్పాటుకు బిజెపి ఇప్పటికి కూడా అనుకూలమేనని ఆయన పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X