వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిశువుల విక్రయానికి సర్కారు బాధ్యత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దత్తతల ముసుగులో సాగుతున్న శిశువుల విక్రయానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్సెస్‌ ఎజెన్సీ (కారా) పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల ఆదారంగానే తాము దత్తత కేంద్రాల నిర్వాహకులకు
గుర్తింపునివ్వడం, గుర్తింపు రద్దు చేయడం చేస్తుంటామని కారా చైర్‌పర్సన్‌ అండాళ్‌ దామోదరన్‌ చెప్పారు.

కారా సవ్యంగా లేకపోవడం వల్లే నేరగాళ్లు సైతం దత్తత కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుపేదలనుంచి పిల్లలను కొని, దత్తతల పేరిట విక్రయిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. శనివారం నాడు హైదరాబాద్‌లో జరిగిన ఒక సదస్సులో పాల్గొంటూ వివిధ రాష్ట్రాల్లోని దత్తత కేంద్రాల పనితీరుపై ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆమెచెప్పారు.

ఇదిలా వుండగా శిశువులవిక్రయం వ్యవహారానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. శనివారం నాడు హైదరాబాద్‌లోవిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఒక సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి భార్య కూడా అక్రమంగా దత్తత కేంద్రం నిర్వహిస్తున్నా ప్రభుత్వం దృష్టికి రాకపోవడం విడ్డూరంగా వున్నదని వ్యాఖ్యానించారు. దత్తత ముసుగులో సాగుతున్న పసిపిల్లలవిక్రయంపై రెండేళ్ల క్రితమే దుమారం చెలరేగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఎత్తిపొడిచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X