వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీ-అజిత్‌ పాంజా భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢీల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత, మాజీ కేంద్ర మంత్రి అజిత్‌పాంజా శనివారం నాడు కేంద్ర హోం మంత్రి ఎల్‌కె అద్వానీతో భేటీ అయ్యారు. ఎన్‌డిఎ నుంచి తృణమూల్‌ విడిపోయిన తర్వాత పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను అద్వానీకి పాంజా వివరించారు.

ఎన్‌డిఎతో తెగతెంపులు చేసుకుంటున్న విషయం మమతా బెనర్జీ తనతో మాటమాత్రం కూడా చెప్పలేదని ఆయన అద్వానీకి చెప్పారు. తాను ఎన్‌డిఎతోనే కొనసాగాలనుకుంటున్నట్టుగా కూడా పాంజా తెలిపారు. ప్రధాని వాజ్‌పేయి ఆహ్వానిస్తే ఆయనతో పాటు బెంగాల్‌లో ఎన్‌డిఎ అభ్యర్ధుల పక్షాల ప్రచారంలో పాల్గొనడానికి తాను సిద్ధంగా వున్నానని కూడా ఆయన పేర్కొన్నారు.

తృణమూల్‌ ఎన్‌డిఎ ఎడబాటు తర్వాత అజిత్‌పాంజా తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీపై తిరుగుబాటు ప్రకటించిన విషయం విదితమే. పశ్చిమబెంగాల్‌ రాజకీయాలకు సంబంధించిఅద్వానీ-పాంజా సమావేశానికి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతవున్నదని పరిశీలకులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X