వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్పేయి మోసంచేశారు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: తెహెల్కా వివాదంవిషయంలో ప్రధాని వాజ్పేయి మోసపూరితంగా వ్యవహరించారనికాంగ్రెస్ విమర్శించింది. తెహెల్కా వివాదంపైసంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటువిషయంలో సానుకూలంగా వ్యవహరిస్తామనివాజ్పేయి సోనియాకు హామీ ఇచ్చారని, ఆ తర్వాత మాటమార్చారని కాంగ్రెస్ ప్రతినిధి ఆస్కార్ ఫెర్నాండెజ్ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు.
సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాననిఅంటే జెపిసిని నియమిస్తానని హామీ ఇచ్చినట్లు కాదా అనిఆయన అడిగారు. జెపిసిని నియమిస్తానని హామీఇవ్వకపోతే తమ కార్యక్రమం అప్పుడు నిర్ణయించుకునివుండేవారమని ఆయన అన్నారు. తెహెల్కా వివాదంపైతాము ప్రజల్లోకి వెళ్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, April 29, 2001, 23:53 [IST]