నీరు-మీరుఅమలు స్థానిక కమిటీలు
హైదరాబాద్: నీరు-మీరు కార్యక్రమంఅమలుకు స్థానిక ప్రజాపతినిధులతో కమిటీలువేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారంఅఖిల పక్ష సమావేశం జరిగింది. నీరు-మీరు కార్యక్రమాన్నిఅధికారులకు అప్పగిస్తే సరిగా అమలు జరగదని, స్థానికరాజకీయ నేతలకు అప్పగిస్తే సక్రమంగా జరిగేఅవకాశాలున్నాయని ప్రతిపక్షాలు అభిప్రాయపడ్డారు. జన్మభూమి కార్యక్రమంవల్ల కాంట్రాక్ట్ సిస్టమ్ పోలేదని,తెలుగుదేశం కార్యకర్తల జేబులు నింపడానికిఉపయోగపడుతోంది గాదె వెంకటరెడ్డి (కాంగ్రెస్)ఆరోపించారు.
నీరు-మీరు కార్యక్రమంఅమలు బాధ్యతలను అధికారులకు కాకుండా స్థానికనాయకులకు అప్పగించాలని ఎన్. ఇంద్రసేనారెడ్డి(బిజెపి) కోరారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్నిఅమలు చేయాలని తాము సూచించడంతో ప్రభుత్వంఅఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిందని, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితోఅమలు చేస్తోందని లాల్ జాన్ బాష(తెలుగుదేశం) అన్నారు.
రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటుధర ఇప్పించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వంవిఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించాయి. భారతఆహార సంస్థ (ఎఫ్సిఐ), మిల్లర్లు ఏకమై రైతులనుదోచుకుంటున్నట్లు ప్రతిపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు.