వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీరు-మీరుఅమలు స్థానిక కమిటీలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నీరు-మీరు కార్యక్రమంఅమలుకు స్థానిక ప్రజాపతినిధులతో కమిటీలువేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారంఅఖిల పక్ష సమావేశం జరిగింది. నీరు-మీరు కార్యక్రమాన్నిఅధికారులకు అప్పగిస్తే సరిగా అమలు జరగదని, స్థానికరాజకీయ నేతలకు అప్పగిస్తే సక్రమంగా జరిగేఅవకాశాలున్నాయని ప్రతిపక్షాలు అభిప్రాయపడ్డారు. జన్మభూమి కార్యక్రమంవల్ల కాంట్రాక్ట్‌ సిస్టమ్‌ పోలేదని,తెలుగుదేశం కార్యకర్తల జేబులు నింపడానికిఉపయోగపడుతోంది గాదె వెంకటరెడ్డి (కాంగ్రెస్‌)ఆరోపించారు.

నీరు-మీరు కార్యక్రమంఅమలు బాధ్యతలను అధికారులకు కాకుండా స్థానికనాయకులకు అప్పగించాలని ఎన్‌. ఇంద్రసేనారెడ్డి(బిజెపి) కోరారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్నిఅమలు చేయాలని తాము సూచించడంతో ప్రభుత్వంఅఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిందని, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితోఅమలు చేస్తోందని లాల్‌ జాన్‌ బాష(తెలుగుదేశం) అన్నారు.

రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటుధర ఇప్పించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వంవిఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించాయి. భారతఆహార సంస్థ (ఎఫ్‌సిఐ), మిల్లర్లు ఏకమై రైతులనుదోచుకుంటున్నట్లు ప్రతిపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X