సిబిఐ విచారణకు సిఎల్పి వినతి
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రయివేట్విద్యుత్ ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయం పెంపుపై సిబిఐవిచారణ జరిపించాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయినికోరింది. ఈ మేరకు సిఎల్పి ప్రధాన కార్యదర్శి డాక్టర్ఎం.వి.మైసురారెడ్డితో పాటు 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు సోమవారం ప్రధానికి ఒక లేఖరాశారు. పెట్టుబడి వ్యయాలను పెంచాలని ప్రయివేట్విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టిన సంస్థలుతాజాగా ప్రతిపాదనలు పంపడంతో తాము ఈ విజ్ఞప్తి చేశామని మైసురారెడ్డివిలేకరులతో చెప్పారు. పెట్టుబడి వ్యయాలనుపెంచే వ్యవహారాల్లో కొంత మంది రాజకీయనాయకులకు పెద్ద యెత్తున ముడుపులు అందాయనిఆయన ఆరోపించారు. సిబిఐ విచారణ జరిపిస్తే ఈ కుంభకోణంబయటపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పెట్టుబడి వ్యయాలు 600 కోట్లరూపాయలు వుంటే వాటిని 770 కోట్ల రూపాయలకుపెంచారని, దీంతో యూనిట్ విద్యుదత్పత్తి ఖర్చు రూపాయినుంచి రూ.1.76 పైసలకు పెరిగిందని ఆయన అన్నారు.ముఖ్యంగా స్పెక్ట్రమ్, జివికె సంస్థల వ్యవహారాల్లోఅక్రమాలు జరిగినట్లు ఆయన ఆరోపించారు. పెట్టుబడివ్యయాల పెంపు బాగోతాన్ని తాము అసెంబ్లీలోబయట పెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంవిచారణకు అంగీకరించలేదని ఆయన చెప్పారు. జివికె పెట్టుబడివ్యయం పెంపు ప్రతిపాదనలు ఆపేయాలని తాము ప్రధానిని కోరినట్లుఆయన తెలిపారు. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన
నిధులు దర్వినియోగంఅవుతున్నాయని అంటూ ప్రపంచ బ్యాంక్ చైర్మన్కుమరో లేఖ రాసినట్లు మైసురా రెడ్డి తెలిపారు.