బాబ్రీ పునర్నిర్మాణమే మా తపన: పివి
చెన్నై: అవినీతి కేసులో 5 సంవత్సరాల శిక్షపడ్డ కేరళ మాజీ మంత్రి బాలకృష్ణ పిళ్ళై నామినేషన్ను అక్కడ రిటర్నింగ్ అధికారులు అంగీకరించటం సబబేనని ఎన్నకల కమీషన్ తేల్చి చెప్పింది. ఈ విషయంలో తమిళనాడు అన్నాడిఎంకె నేత జయలలిత చేస్తున్న విమర్శలను ఎన్నికల సంఘం కొట్టివేసింది.
ఎన్నికల కమిషన్ తీర్పుతో జయలలతకు అందుబాటులోకి వచ్చిన బలమైన ఆయుధం చేయిజారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగుచోట్ల నుంచి నామినేషన్ దాఖలు చేసిన జయలలిత భంగపాటుకు గురైన విషయం విదితమే. తన నామినేషన్ల తిరస్కృతికి వ్యతిరేకంగా పిళ్లై కేసును ఆధారంగా చేసుకుని న్యాయస్థానంలో పోరాటం చేయాలని జయ ఆశించారు. రెప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 8 (4) ప్రకారం పదవిలోవున్న ఎంపిలు,ఎంఎల్ఏల శిక్ష పడినప్పటికీ , శిక్ష అమలు మూడునెలలు వాయిదాపడి, ఆలోపు వారు పై కోర్టుకు అప్పీల్ చేసుకునివుంటే వారికి ఎన్నికలలో పోటీ చేసే అవకాశమున్నదని చీఫ్ ఎలక్సన్ కమీషనర్ ఎం.ఎస్.గిల్ సోమవారం నాడు స్పష్టం చేశారు.దీంతో, జయలలితకు ఉన్న ఒక్కదారీ మూసుకుపోయినట్టయ్యింది. ఈ నిర్ణయంపై జయలలిత స్పందన ఇంకా రావాల్సివుంది.