వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పత్రికలపైఎమ్మెస్‌ రుసరుసలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వార్తా పత్రికలపైప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్‌) చిర్రుబుర్రులాడారు. రైతులసమస్యలపై పిసిసి తలపెట్టిన ఆందోళనకు అంతగాస్పందన లేదని వచ్చిన వార్తలకు ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో తీవ్రంగాప్రతిస్పందించారు. అది మంచి పద్ధతి కాదని, ఆందోళన కార్యక్రమానికివేయి మంది వచ్చారా, లక్ష మంది వచ్చారా అనేది ప్రధానంకాదని, తాము రైతు సమస్యల పరిష్కారం కోసం ఏదైనాత్యాగం చేయడానికి సిద్ధంగా వున్నామని ఆయన తీవ్రస్వరంతో అన్నారు.

రైతు సమస్యల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తూమే 8వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రాస్తా రోకోలునిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

పసి పిల్లల విక్రయాలకు పాల్పడుతున్నవారిని ఉరి తీయాలని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణాపై పిసిసి ఒక విధానంలేదని తెలంగాణా రాష్ట్ర సమితి నేత కె. చంద్రశేఖర్‌ రావు చేసినవిమర్శను ఆయన ఖండించారు. చిన్న రాష్ట్రాలఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ఏర్పడిన సబ్‌ కమిటీ ఈవిషయాన్ని పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. కమిటీ సూచనమేరకు ఎఐసిసి నిర్ణయం తీసుకుంటుందని ఆయనచెప్పారు.

తెహెల్కా కుంభకోణానికి బాధ్యతవహిస్తూ వాజ్‌పేయి ప్రభుత్వం రాజీనామాచేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారంనుంచి రెండవ విడత ఆందోళనను చేపట్టునున్నట్లుఆయన తెలిపారు. ఇందులో భాగంగా మే 1 నుంచి 4వ తేదీవరకు సంతకాల సేకరణ ఉద్యమం చేపడుతామనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X