వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ పునర్‌నిర్మాణమే మా తపన: పివి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : తన ప్రభుత్వం బాబ్రీ మసీదు పునర్‌నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నదనీ, అయితే వ్యవహారం న్యాయస్థానంలో వుండటం వల్ల ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోయామని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు లిబర్‌హాన్‌ కమీషన్‌ ముందు వెల్లడించారు. బాబ్రీ మసీదు కూల్చివేత దరిమిలా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో బాబ్రీ మసీదు పునర్‌నిర్మాణానికి తాను హామీ ఇచ్చిన విషయం ఆయన నిర్ద్వంద్వంగా ఒప్పుకున్నారు. సోమవారం నాడు లిబర్‌హన్‌ కమిషన్‌ ముందు పివి మరోసారి హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.

మాది బూటకపు వాగ్ధానం కాదు. అది చాలా కీలకమైన హామీ. నిజాయితీగానే మేమా వాగ్ధానం చేశాం. అయితే బాబ్రీ విధ్వంసం వ్యవహారం న్యాయస్థానం పరిథిలోకి వెళ్లడంతో, మసీదు పునర్‌నిర్మాణ హామీని ఆచరణ సాధ్యం చేయలేకపోయాం అని ఆయన సోమవారం నాడు కమీషన్‌ ముందు పేర్కొన్నారు.
మసీదును తిరిగి నిర్మించాలన్నదే అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని ఆయన తెలిపారు.

మసీదును కూల్చిన స్ధలంలో కరసేవకులు చేసిన తాత్కాలిక మందిర నిర్మణాన్ని కూల్చివేయడం సాధ్యంకాదనీ, అక్కడ పరిస్థితి మహోద్రేకంగా వున్నదని సుప్రీమ్‌కోర్టుకు నివేదించాల్సిందిగా మంత్రిమండలి, అటార్నీ జనరల్‌ మిలన్‌ బెనర్జీని ఆదేశించలేదని కూడా ఆయన చెప్పారు.కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు రెండూ తమ 1991 లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలో అమోధ్యలో ఆలయం, మసీదు రెండూవున్నట్టు అంగీకరించాయని పివి తెలిపారు. అయితే ఈ విషయాన్ని వివరించడానకి రెండు పార్టీలు ఎత్తుకున్న వాదనలు, అవలంభించిన విధానం మాత్రం పూర్తిగావేరని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X