టెన్త్లో ప్రకాశం జిల్లాటాప్
హైదరాబాద్:ఈ ఏడాది మార్చిలో జరిగిన పదవతరగతి పరీక్షల్లో 65.11 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతం 10.63 శాతం ఎక్కువగా వుంది. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 5,74,555 మంది రెగ్యులర్ అభ్యర్ధులు హాజరుకాగా వారిలో బాలలు 3,31,673 మంది, బాలికలు 2,42,882 మంది వున్నారు. బాలలకంటే బాలికల్లోనే ఉత్తీర్ణత శాతంకొద్దిగా హెచ్చుగా వుంది.రాష్ట్ర పాఠశాల విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఉదయం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఏడాది రాష్ట్రంలోని 303 పాఠశాలలు నూరు శాతం రిజల్ట్స్ సాధించాయి. 27 స్కూళ్లలో జీరో ఉత్తీర్ణత శాతం వుంది. జిల్లాల వారిగా చూస్తే ప్రకాశం జిల్లా 82.45 శాతం ఉత్తీర్ణతతో ప్రధమ స్థానంలో వుంది. కాగా కడప జిల్లా 50.55 శాతంతో కనిష్టస్థాయిలో వుంది. ఫెయిలయిన అభ్యర్ధుల కోసం మే ఆఖరు వారంలో సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ ఏడాది పరీక్షలు జరిగిన 30 రోజుల్లోనే ప్రభుత్వం ఫలితాలను ప్రకటించి రికార్డు సృష్టించింది. ఉత్తీర్ణతలో ప్రకాశం తర్వాత స్థానంలో వరంగల్, నల్లగొండ వున్నాయి.