వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్
కరీంనగర్ : నేత కార్మికుల ఆత్మహత్యలకు నెలవైన సిరిసిల్లలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి వి. ధనుంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన సిరిసిల్లలోపర్యటించారు.
అలాగే, సిరిసిల్ల పట్టణంలో పవర్లూమ్ సర్వీసింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ (ఎన్.టి.సి) ద్వారా సిరిసిల్లలో నూలు కండెల డిపోను ఏర్పాటు చేస్తామని కూడా మంత్రి ప్రకటించారు.
Comments
Story first published: Monday, April 30, 2001, 23:53 [IST]