వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సెప్టెంబర్ లోబుష్-వాజ్ పేయి భేటీ
న్యూఢిల్లీః భారత ప్రధాని వాజ్ పేయి ఈ ఏడాదిసెప్టెంబర్ లో అమెరికా అధ్యక్షుడు బుష్ ను కలుసుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా బుష్ తో మొదటి సారిగా వాజ్పేయి సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశానికి ఇంకా ఆమోద ముద్ర లభించాల్సి వుంది.
ఏ తేదీన, ఏ సమయంలో బుష్ తో భేటీ అవుతారనేఅంశంపై ఉభయ దేశాలకు చెందిన అధికారులు చర్చించ ఒక నిర్ణయం తీసుకుంటారు.2000 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ లో పర్యటించిన నాటి నుంచి భారత్ అమెరికా సంబంధాలు కొత్తపుంతలు తొక్కాయి. అమెరికాలో కొత్తగా ఏర్పడిన రిపబ్లికన్ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకొనేందుకు భారత్ కూడా ఆసక్తి చూపుతున్నది. బుష్ ను భారత్ లో పర్యటించాల్సిందిగా కూడా వాజ్పేయి ఈ సందర్భంగా ఆయనను కోరే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, May 1, 2001, 23:53 [IST]