వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరహక్కులకు ప్రాణభయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో పౌరహక్కుల సంఘం నాయకులపై పోలీసుల దాడులు, వేధింపులు పెరిగిపోయాయని ఆరోపిస్తూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం నేతలుమంగళవారం నాడు రాష్ట్ర గవర్నర్‌ రంగరాజన్‌కు వినతి పత్రం సమర్పించారు. పీపుల్స్‌ వార్‌ నక్సలైట్లతో సంబంధాలు వున్నాయని అంగీకరించాల్సిందిగా పౌరహక్కుల నాయకులపై పోలీసులు దాడులు చేస్తున్నట్టుగా వారు ఆరోపించారు.

పౌరహక్కుల నేతలపై దాడులను, వేధింపులను నిరోధించడానికి జోక్యం చేసుకోవల్సిందిగా వారు గవర్నర్‌ను కోరారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను, పౌరహక్కుల ఉల్లంఘనను ప్రశ్నిస్తున్నందుకే తమపై దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. ఆత్మహత్య తప్ప మార్గాంతరం లేని స్థితికి రైతులను, చేనేత కార్మికులను ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలే నెట్టివేశాయని వారు పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X