భారత్ కు పొగడ్తలు-పాక్ కు చీవాట్లు
వాషింగ్టన్ః అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత దేశం చూపుతున్న చొరవను అమెరికా ప్రశంసించింది. అంతర్జాతీయ తీవ్రవాదాన్నిపెంచిపోషిస్తూ, జమ్మూ కాశ్మీర్ లో చొరబాట్లను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై అమెరికా దుమ్మెత్తి పోసింది. అంతర్జాతీయ ఉగ్రవాదాన్నిఅరికట్టేందుకు భారత్ చూపుతున్న చొరవ ప్రశంసనీయమని అమెరికావిదేశాంగశాఖ కార్యదర్శి పోవెల్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా పాకిస్తాన్ వైఖరిని అమెరికా విదేశాంగశాఖవార్షిక నివేదిక తీవ్రంగా దుయ్యబట్టింది.
అంతర్జాతీయ తీవ్రవాదాన్ని అరికట్టేందుకు అమెరికా చేస్తున్న కృషికి భారత్ ఎంతగానో సహకరిస్తున్నదని పోవెల్ వ్యాఖ్యానించడంవిశేషం. ఉగ్రవాద నిర్మూలనపై 1999 నవంబర్ లో ప్రారంభమైన భారత్-అమెరికా ఉమ్మడి సంఘం పనితీరును కూడా పోవెల్ ప్రశంసించారు.
జనరల్
పర్వేజ్
ముషారఫ్
సారధ్యం
లోని
పాక్
ప్రభుత్వం
కాశ్మీర్
లో
చొరబాట్లను
ప్రోత్సహించడంతో
పాటు
తీవ్రవాదానికి
నిధులు
కూడా
సమకూర్చుతున్నదని
ఆయనవిమర్శించారు.
కాశ్మీర్
లో
అమాయకులను
పొట్టనపెట్టుకుంటున్న
తీవ్రవాద
సంస్థలకు
పాక్
వత్తాసు
పలకడంగర్హనీయమని
పోవెల్
అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్
లోని
తాలిబన్లకు
కూడా
పాక్
సహాయ
సహకారాలుఅందించడాన్ని
అమెరికా
తప్పు
పట్టింది.