చిన్నారుల అమ్మకాల భారం రాష్ట్రలదే
హైదరాబాద్ః పిల్లల దత్తతఅంశం రాష్ట్రాల జాబితాలో వున్నందున ఈ వ్యవహారంలో అవకతవకలు జరగకుండా చూసేందుకు రాష్ట్రాలే తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని ఆమె చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీకి ఈవిషయంలో కొన్ని సూచనలు మాత్రం ఇవ్వగలనని ఆమె చెప్పారు. పిల్లల దత్తతఅంశాన్నికేంద్రంలో కూర్చున్న కారా పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం సాధ్యం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని ఆమె చెప్పారు.
పలు
కార్యక్రమాలలో
పాల్గొనేందుకు
బుధవారం
హైదరాబాద్
వచ్చిన
సుమిత్రా
మహాజన్
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడును
కలుసుకున్నారు.
రాష్ట్ర
ప్రభుత్వం
చేపడుతున్న
డ్వాక్రా
తదితర
కార్యక్రమాలను
ఆమె
ప్రశంసించారు.
శిశువుల
అమ్మకాలను
నిరోధించేందుకు
రాష్ట్ర
ప్రభుత్వం
కట్టుదిట్టమైన
చర్యలు
తీసుకోవాలని
ఆమె
సూచించారు.