వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లలు చనిపోయింది రికార్డులలోనే....

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : బేతానీ హోమ్‌ కిరాతకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హోమ్‌లో చనిపోయినట్టు రికార్డులలో చూపిన పిల్లలు వాస్తవానికి చనిపోలేదని, చనిపోయినట్టు రికార్డులలోచూపి, ఆ పసికందులను విదేశాలకు ఎగుమతి చేశారని తెలుస్తోంది. దత్తత పిల్లలు మరణిస్తే కారా నిబంధనల ప్రకారం స్ధానిక పోలీసు స్టేషనులో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాల్సివున్నా, బేతాని హోమ్‌ నిర్వాహకులు నిబంధనలను పాటించలేదు.

హోమ్‌ను పరిశీలించిన జాతీయ మహిళా కమీషన్‌ సభ్యురాలు పి.శాంతారెడ్డి, ఇండియన్‌ రీసెర్చి ప్రొఫెసర్‌ సాదిక్‌ జిలాని సయిద్‌, కారా ద్విసభ్య కమిషన్‌ రికార్డులు సరిగా లేవన్న విషయం కనుగొన్నారు.హోమ్‌లో 18 మంది పిల్లలు చినిపోయినట్టు రికార్డులలో పేర్కొనగా అందుకు సంబంధించిన సమగ్ర సమాచారం మాత్రం లేదు. హోమ్‌లో చనిపోయిన పిల్లలను పూడ్చిపెట్టిన గోతులు 9 మాత్రమే వున్నాయి. అక్కడ పనిచేసే ఆయాలు కూడా చనిపోయింది తొమ్మిది మంది మాత్రమేనని చెబుతున్నారు.

అలాగే, హోమ్‌నుంచి ప్రభుత్వ శిశుమందిర్‌కు 61 మందిని తరలించినట్టు ఆయాలు చెబుతుండగా, 59 మంది మాత్రమే వచ్చారని శిశుమందిర్‌ నిర్వాహకులు అంటున్నారు.దీంతో, మిగిలిన పిల్లలు ఏమైపోయారన్నది మిస్టరీగా మారింది. శిశు మందిర్‌కు తరలించిన పిల్లలలో కొందరికి కనుబొమ్మలు తొలగించటం, కళ్లు పీకేసి పూర్తిగా గుడ్డివారిగా మార్చిన విషయం వెలుగు చూడటంతో అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి.

చిన్నారులు చనిపోయినట్టు రికార్డులలో చూపించి, వారి అవయవాలు తొలగించి విదేశాలకు ఎగుమతి చేసినట్టు భావిస్తున్నారు. విదేశాలలో వికలాంగులైన పిల్లలను దత్తత తీసుకున్నవారికి అనేక రాయితీలు, సదుపాయాలు వుండటంతో ఇక్కడినుంచి పిల్లలను వికలాంగులుగా మార్చి తరలించి వుంటారని తెలుస్తోంది.

అధికారులు సమగ్రంగా విచారిస్తే మరిన్ని దారుణ సత్యాలు వెలుగు చూసే అవకాశముంది. హోమ్‌ నిర్వాహకురాలు సావిత్రి అరెస్టు కాకుండా అభించే సమాచారం పాక్షికమే అవుతుంది. కావున, తక్షణం సావిత్రి అరెస్టుచేసి వాస్తవాలను వెలుగులోకితేవాలని అన్ని వర్గాల ప్రజలూ కోరుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X