వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్కౌంటర్లో వార్ నక్సల్ మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా పోచంపల్లి మండలం నారాయణగిరి కొండల్లో మంగళవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో పీపుల్స్వార్ గ్రూపుకు చెందిన ఒక నక్సలైట్ మృతి చెందాడు. మృతి చెందిన నక్సలైట్ ఆలేరు దళ సభ్యుడిగా భావిస్తున్నారు. చనిపోయిన నక్సలైట్ పూర్తి వివరాలు తెలియరావాల్సి వుంది.
సంఘటనా స్ధలం నుంచి ఒక రివాల్వార్, హ్యండ్ గ్రేనేడ్లను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. నారాయణగిరి కొండల్లో నక్సల్స్ సంచరిస్తున్న విషయం తెలిసి గాలింపు చేపట్టిన పోలీసులకు నలుగురు నక్సల్స్తో కూడిన బృందం ఎదురయిందని లొంగిపోకుండా కాల్పులకు దిగిన నక్సల్స్పై పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని అధికారులు చెప్పారు. మిగిలిన దళ సభ్యలు పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Story first published: Wednesday, May 2, 2001, 23:53 [IST]