వెయ్యికోట్ల దేవుని భూములు హాంఫట్!
హైదరాబాద్ః రాష్ట్రంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. జంటనగరాలలోని పలు దేవాలయాలను మంత్రి బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. పలు దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జా కోరల్లో చిక్కుకోవడం పట్ల ఆయనవిస్మయం వ్యక్తం చేశారు.
దేవాలయ
భూములను
కొందరు
సొంతం
చేసుకొని
పూర్తి
స్థాయి
భవనాలు
కూడా
నిర్మిచుకున్నారని
ఆయన
చెప్పారు.
అన్యాక్రాంతంఅయిన
భూముల
విలువ
సుమారు
వెయ్యి
కోట్ల
రూపాయల
వరకు
వుంటుందని
ఆయనఅంచనా
వేశారు.
ఈ
భూములను
స్వాధీనం
చేసుకొన్న
వారు
ఎంతపెద్దమనుషులైనా
వారిపై
చట్టరీత్యా
చర్యలు
తీసుకుంటామని
ఆయన
హెచ్చరించారు.
దేవాలయాల
భూములను
తిరిగి
స్వాధీనం
చేసుకొనేందుకు
చివరి
వరకు
పోరాటం
సాగిస్తామని
ఆయన
చెప్పారు.
రాష్ట్రంలో
అన్యాక్రాంతంఅయిన
భూములను
గుర్తించేందుకు
ఒక
ప్రత్యేక
బృందాన్ని
ఏర్పాటు
చేస్తున్నట్లు
ఆయన
చెప్పారు.