వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దత్తత చట్టంలోమార్పులు: సుమిత్ర
హైదరాబాద్: రాష్ట్రంలో పిల్లలవిక్రయాలపై సామాజిక న్యాయశాఖ మంత్రి మేనకా గాంధీతోచర్చిస్తానని మానవ వనరుల అభివృద్ధి,స్త్రీశిశు అభివృద్ధి శాఖల సహాయ మంత్రి సుమిత్రామహాజన్ చెప్పారు. ఆమె గురువారంనాడుశిశువిహార్లోని పిల్లలను పరామర్శించారు. పిల్లలవిక్రయాలను నిరోధించడానికి దత్తత చట్టంలోమార్పులు చేయాల్సిన అవసరం వున్నదని ఆమెవిలేకరులతో అన్నారు.
వివిధ దత్తత కేంద్రాలనుంచి తెచ్చి శిశువిహార్లో వుంచిన పిల్లల స్థితిగతులను తెలుసుకున్నానని ఆమెచెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో దత్తత వ్యవహారాలపైహోం మంత్రి ఎల్.కె. అద్వానీతో మాట్లాడుతానని ఆమెచెప్పారు. విదేశాల్లో పిల్లలను దత్తత ఇవ్వడం, తదనంతరపరిణామాలపై మేనకాగాంధీతో మాట్లాడనున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Story first published: Thursday, May 3, 2001, 23:53 [IST]