వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి హైకోర్టుఆదేశానికి సుప్రీం బ్రేక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు పనిచేయడాన్ని ఆపివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చినఆదేశంపై సుప్రీంకోర్టు బుధవారం స్టే ఇచ్చింది. ఈ కోర్టుల ఏర్పాటువల్ల న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశంవుందని హైకోర్టు అనుమానం వ్యక్తంచేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిర్ణయంపైఅటార్నీ జనరల్‌ సోలీ సొరాబ్జీ సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించినజస్టిస్‌ బి.ఎన్‌. కిర్‌పాల్‌, జస్టిస్‌ రుమపాల్‌లతో కూడిన బెంచీ ప్రస్తుతానికిహైకోర్టు నిర్ణయాన్ని నిలిపేస్తున్నట్లుప్రకటించింది.

ఏళ్ల తరబడి పెండింగ్‌లోవున్న ఉన్న కేసులను త్వరగాపరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వంప్రవేశపెట్టిన ఈ పథకాన్ని బలహీనమైన కారణాలుచూపి హైకోర్టు నిలిపేసిందని సోరాబ్జీ అన్నారు.ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు వల్ల పరిస్థితి ఘోరంగాతయారవుతుందన్న హైకోర్టు తన తీర్పును పూర్తిగావివరించలేదని ఆయన అన్నారు. ప్రస్తుతంహైకోర్టు కూడా కేసుల పెండింగ్‌ సమస్యనుఎదుర్కుంటోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X