దీన్ దార్ అంజుమన్ పై నిషేధం వేటు
న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గోవా రాష్ట్రాలలో పలు ప్రార్థనా స్థలాలలోపేలుళ్ళకు కారణమైన దీన్ దార్ అంజుమన్ సంస్థను కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధించింది. ఈ సంస్థను చట్టవ్యతిరేక సంస్థగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రకటించారు. దీన్ దార్అంజుమన్ సంస్థ హైదరాబాద్ తో పాటు గుంటూరు,విజయవాడ తదితర పట్టణాలలోని ప్రార్థనా స్థలాలను బాంబులతోపేల్చివేసిన విషయం విదితమే. ఫలితంగా ప్రశాంతంగా వుండే కోస్తా జిల్లాలలో సైతం మత కల్లోలానికి ఈ సంస్థ కారణమైంది.
కృష్టా జిల్లా నూజివీడు కేంద్రంగా ఈ సంస్థ భారీగావిస్తరించి, విదేశీ నిధులతో పెద్ద ఎత్తున విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడింది. కర్నాటకలో కూడా ఈ సంస్థ ప్రార్థనా స్థలాలనుపేల్చి వేసి విధ్వంసానికి పాల్పడింది.
దీన్
దార్
అంజుమన్
సంస్థను
నిషేధించాల్సిందిగా
ఆంధ్ర
ప్రదేశ్,
కర్నాటక
ప్రభుత్వాలు
కేంద్రాన్నికోరాయి.
ఫలితంగా
ఈ
సంస్థను
చట్టవ్యతిరేక
సంస్థగా
కేంద్రం
గురువారం
ప్రకటించింది.
దేశంలో
శాంతి
భద్రతలకు
భంగం
కలిగించడంతో
పాటు
అంతరంగిక
భద్రతకు
ఈ
సంస్థ
ముప్పు
కలిగిస్తున్నదని
హోం
మంత్రిత్వ
శాఖ
వ్యాఖ్యానించింది.