పాంజా ఇంటి ముందు బాంబుపేలుళ్లు
కోల్కత్తా: తృణమూల్కాంగ్రెస్ అసమ్మతి నేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ పాంజా ఇంటి ముందుబుధవారం సాయంత్రం రెండు శక్తివంతమైన బాంబులుపేలాయి. మోటారు సైకిల్పై వచ్చిన దుండగులుఇనుపగుళ్లు, గాజుముక్కలతో నింపిన బాంబులను పాంజా ఇంటి గేటుముందు విసిరేసి పారిపోయారు. ఎవరూ గాయపడలేదు.
ఆదివారంనాడు కామర్హతిలో ప్రధానివాజ్పేయి ప్రసంగించే ఎన్నికల సభలో పాల్గొంటాననిప్రకటించేందుకు పాంజా తన నివాసంలో విలేకరుల సమావేశంల ఏర్పాటుచేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఆసిం ఘోష్తో కలిసి పాంజావిలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఇంటిముందు బాంబులు పేలాయి. బాంబులు విసిరి పారిపోతున్నవారిలో ఒకర్నిప్రదీప్డేగా గుర్తించారు. అతను నిరుడు కోల్కత్తామున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సిపిఎం అసమ్మతి అభ్యర్థిగా పోటీ చేశాడు. సిపిఎం అసమ్మతి నేతలు పలువురు ప్రస్తుతం తృణమూల్కాంగ్రెస్లో వున్నారు. బాంబులు విసిరినవారినిఉద్దేశంపై మాట్లాడడానికి పాంజా నిరాకరించారు. అదితేల్చాల్సింది పోలీసులేనని ఆయన అన్నారు.