వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేశూభాయ్ప్రభుత్వంపై ఉమ విమర్శ
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ ప్రభుత్వం భూకంప బాధితులకుసహాయం అందించడంలో విఫలమైందనికేంద్ర క్రీడల శాఖ మంత్రి ఉమాభారతి విమర్శించారు. చాలినంతసహాయం అందించడంలో గుజరాత్ ప్రభుత్వం సక్రమంగావ్యవహరించలేకపోయిందని ఆమె అన్నారు.అహ్మదాబాద్లో ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈవిమర్శ చేశారు.
భూకంప బాధితుల కోసంవిరాళాలు విరివిగానే వచ్చాయని, ఈ విరాళాలను సవ్యంగాఉపయోగించుకుంటే సరిపోతాయని, అయితే అధికారయంత్రాంగం సరిగా స్పందించడంలోనూ, సవ్యంగా పంపిణీచేయడంలోనూ విఫలమైందని ఆమె అన్నారు. ఈవిషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడేగ్రహిస్తోందని ఆమె చెప్పారు. బాధితులకుసహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేఅనడంలో సందేహం లేదని, అయితే,ప్రభుత్వానికి ప్రజల తోడ్పాటు కూడా అవసరమని ఉమాభారతిఅన్నారు.
Comments
Story first published: Thursday, May 3, 2001, 23:53 [IST]