వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్ చేతిలో ముగ్గరు హతం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో పీపుల్స్వార్ నక్సలైట్లు గురువారం నాడు ఒక మాజీనక్సలైట్ను, మరో పోలీస్కానిస్టేబుల్, అతని సోదరుడిని కాల్చి చంపేశారు. మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఆ గ్రామంలో కాపురముంటున్న పెనుగొండ సాయిలును కాల్చి చంపారు.
సాయిలును కాల్చిచంపిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎల్లంపేట్కు ఆరు కిలోమీటర్ల దూరంలో పోలీసు కానిస్టేబుల్ రాములును నక్సలైట్లు కాల్చి చంపారు. రాములును రక్షించేందుకు అతని సోదరుడు సంగ్యా నక్సలైట్లను అడ్డుకోగా ఆగ్రహించిన నక్సలైట్లు సంగ్యాను కూడా కాల్చి చంపారు. ఈ సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
Story first published: Thursday, May 3, 2001, 23:53 [IST]