డీజిల్, సిమెంట్ పై పన్నుల మోత
హైదరాబాద్ః డీజిల్, సిమెంట్ లపై రాష్ట్ర ప్రభుత్వం ఎంట్రీ టాక్స్ విధించింది. అదే విధంగా గుట్కా పై 50 శాతం లగ్జరీ టాక్స్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీజిల్ పై 19 శాతం, సిమెంట్ పై 16 శాతం ఎంట్రీ టాక్స్ విధిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్ లోపేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో డీజిల్, సిమెంట్ పై పన్నులు తక్కువగా వుండడంతో ఆ రాష్ట్రాల నుంచి వాటిని అడ్డదారుల్లో రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారని,అందువల్ల ఎంట్రీ టాక్స్ విధించినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు.
గుట్కాపై 50 శాతం లగ్జరీ పన్ను విధిస్తున్నామని, గుట్కా వాడకాన్ని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా ఈ పన్ను విధించామని అధికారులువివరించారు. ఈ ఉత్పత్తులపై అదనపు భారాన్ని మోపాలని ఇటీవల సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించినవిషయం విదితమే.