వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యేక తెలంగాణాకు పునర్జన్మ
హైదరాబాద్ః తమకు ఇతర ప్రాంతాల ప్రజల పట్ల ఏ మాత్రం వ్యతిరేకత లేదని, తెలంగాణాకు న్యాయం జరగాలన్నదే తమ ఉద్యమ లక్ష్యమని తెలంగాణా రాష్ట్ర సమితి నేత, మాజీ డిప్యూటీస్పీకర్ చంద్రశేఖర రావు ప్రకటించారు. తమ ఉద్యమం శాంతియుతంగా జరుగుతుందని శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు.
తాము ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని కోరుకోవడం లేదని, కేవలం గతంలో తెలంగాణాకు వున్న ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని చంద్రశేఖర రావు వివరించారు. త్వరలో తెలంగాణా రాష్ట్ర సమితి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. రేపటి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చంద్రశేఖర్ చెప్పారు.
Comments
Story first published: Friday, May 4, 2001, 23:53 [IST]