వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉల్ఫా దాడికి 8మంది బలి
గౌహతి: అస్సాం ఎన్నికల్లోహింస కొనసాగుతూనే వుంది. ఉల్ఫాతీవ్రవాదుల దాడిలో ఎనిమిది మరణించారు.ఇద్దరు వేర్పాటువాద తిరుగుబాటు దారులు మృతిచెందారు. ధర్మాపూర్ వద్ద పాలక అస్సాం గణ పరిషత్కార్యాలయంపై గురువారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ఉల్ఫాతీవ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులుజరిపారు.
ఈ దాడిలోని అస్సాం గణ పరిషత్ కార్యకర్తలు ఆరుగురుమరణించారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, ఒకరు ఆస్పత్రికితరలిస్తుండగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. మిగతావారు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూమరణించారు.
గోల్పూరా వద్ద అస్సాం గణ పరిషత్కార్యాలయంపై ఉల్ఫా తీవ్రవాదులు బాంబులతో దాడిచేశారు. ఈ దాడిలో 17 మందికి గాయాలయ్యాయి.
Comments
Story first published: Friday, May 4, 2001, 23:53 [IST]