వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అస్సాంలో ఆరుగురు బలి
గౌహతి : అస్సాంలో ఆరుగురు కాంగ్రెస్ కార్యకర్తలను ఉల్ఫా తీవ్రవాదులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నంలోపు కాల్చిచంపారు. సోనేపూర్ జిల్లాలో ఇరువురిని, బర్కియా జిల్లాలో ముగ్గురిని, ఛాయనాజ్లో మరొక కంగ్రెస్ కార్యకర్తనూ ఉల్ఫా తీవ్రవాదులు కాల్చి చంపారు.కాగా, పారా మిలటరీ జవానుల కాల్పులో ఒక తీవ్రవాది హత మయ్యాడు.
ఇది ఇలావుండగా, ఎజిపి- బిజెపి కూటమిని ఎదుర్కోలేని కాంగ్రెస్ అస్సాంలో ఉల్ఫాను ఆశ్రయించిందని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి విద్యాసాగరరావు ఆరోపించారు. తీవ్రవాద సంస్ధ ఉల్ఫాతో సంబంధాలను కొనసాగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుటామని ఆయన కాంగ్రెస్ను హెచ్ఛరించారు.
Comments
Story first published: Sunday, May 6, 2001, 23:53 [IST]