వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ సరిహద్దులో భారత్ వార్గేమ్స్
న్యూఢిల్లీ: భారతదేశం పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో శనివారం మిలటరీ ఎక్స్రైజ్కు పూనుకుంది. భారత్ గత 13 ఏళ్లలో ఇంత పెద్ద యెత్తున సైనిక ప్రదర్శన నిర్వహించడం ఇదే మొదటిసారి. ఎక్సర్సైజ్ మొదటి దశలో శత్రువును గర్తించే కార్యక్రమం వుంటుందని కల్నల్ శ్రుతికాంత్ చెప్పారు.
తుది ఘట్టం మే 10వ తేదీన వుంటుందని ఆయన అన్నారు. రాజస్థాన్ బికనూర్ సెక్టార్లో నిర్వహిస్తున్న ఈ ఐదు రోజుల వార్ గేమ్స్లో 60 వేల బలగాలు, రష్యా నిర్మిత టి-72 ట్యాంక్లు, వందకు పైగా రవాణా, యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. రాజస్థాన్లోని పోఖ్రాన్లో అత్యంత శక్తివంతమైన ఆయుధ రాకెట్లను, యుద్ధ క్షిపణులను పేల్చడం ద్వారా ఈ వార్ గేమ్స్ను ముగిస్తారు.
Comments
Story first published: Sunday, May 6, 2001, 23:53 [IST]