వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుంటూరు జిల్లాలో పోలీస్-నక్సలైట్ల యుద్ధం
గుంటూరుః గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పెరికపాడు వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచిపీపుల్స్ వార్ నక్సలైట్లు-పోలీసులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరుగుతున్నది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి7 గంటల వరకు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతునే వున్నాయి. ఈ ఎదురు కాల్పులలో ఇద్దరు నక్సలైట్లు మరణించినట్లు సమాచారంఅందింది.
భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నందున మరింత మంది మరణించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంఘటన సమాచారంఅందడంతో పోలీసు ఉన్నాతాధికారులు హుటాహుటిన బెల్లంకొండ ప్రాంతానికి తరలి వెళ్ళారు. గుంటూరు జిల్లాలో ఇటీవల నక్సలైట్ల కదలికలు పెరిగుతున్నప్పటికీ ఇంతపెద్దఎత్తున ఎన్ కౌంటర్ జరగడం విశేషం.
Comments
Story first published: Sunday, May 6, 2001, 23:53 [IST]