ఆడశిశువులపై నివేదిక కోరిన హక్కుల కమిషన్
న్యూఢిల్లీః ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న ఆడశిశువుల అమ్మకంపై తక్షణం పూర్తి స్థాయి నివేదికను పంపాల్సిందిగా జాతీయ మానవహక్కుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఆడశిశువులవిక్రయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినవిషయం విదితమే.
ఈ దారుణానికి సంబంధించి ఒక జాతీయ పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ఆంధ్ర రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతానికి చెందిన అమాయకులు, నిరక్షరాస్యులైన తలిదండ్రులు ఆడశిశువులను దత్తత సంస్థలకు తెగనమ్ముకోవడం లేదా వారినపెంచి పోషించే శక్తిలేక హత్య చేస్తున్నారంటూ జాతీయ పత్రికలలో వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై తీవ్రంగా స్పందించిన మానవహక్కుల సంఘం తక్షణం పూర్తి స్థాయి నివేదిక పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
స్పాట్లైట్ః
ఆంధ్ర
మాతకు
గర్భశోకం
ఆడ
శిశువుల
విక్రయం...