దీన్ దార్ కార్యాలయం మూసివేత
హైదరాబాద్ః దీన్ దార్అంజుమన్ సంస్థపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆ పార్టీ కార్యాలయానికిసీలువేసింది. హైదరాబాద్ పాతబస్తీలో వున్న దీన్ దార్అంజుమన్ కార్యాలయాన్ని సోమవారం పోలీసుల సీలు చేశారు. ఆ సంస్థ బోర్డులను తొలగించారు. రీకార్డులను, ఆ సంస్థ సాహిత్యాన్నిస్వాధీనం చేసుకున్నారు.
శాంతియుతంగా కార్యకలాపాలు సాగిస్తున్న తమ సంస్థపై నిషేధాన్ని విధించడం అన్యాయమని దీన్ దార్అంజుమన్ నేతలు విమర్శించారు. దీన్ దార్ సంస్థ కార్యకలాపాలను ఇకముందు ఎవరైనా కొనసాగిస్తే వారినిఅరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్,
కర్నాటక,
గోవా
రాష్ట్రాలలోని
ప్రార్థనా
స్థలాలను
ధ్వంసం
చేసి
మత
కల్లోలం
సృష్టించేందుకు
దీన్
దార్అంజుమన్
సంస్థ
ప్రయత్నించిందనే
ఆరోపణలు
వున్నాయి.
ఈ
సంస్థకు
చెందిన
40
మంది
వివిధ
ఆరోపణలపై
ఇప్పడు
జైళ్ళలో
వున్నారు.