వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వడదెబ్బకు నలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ జిల్లాల్లో ఎండలు తీవ్రస్థాయిలో వుండటంతో ఆదివారం నాడు వడదెబ్బకు కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ముగ్గురు 35 ఏళ్ల యువకులు. కాగా ఒక్కరు మాత్రం 50 ఏళ్ల వ్యక్తి. కరీంనగర్‌ జిల్లాలో నయీం అనే లారీ డ్రైవర్‌, లచ్చయ్య అనే గీత కార్మికుడు వడదెబ్బ కారణంగా మరణించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో తమిళనాడు నుంచి వచ్చిన సత్యం అనే కూలీ, ప్రమ్‌సింగ్‌ అనే 50 ఏళ్ల యాచకుడు వడదెబ్బవల్ల మరణించినట్టుగా అధికారులు తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో గత కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలను దాటుతున్నది. ఉదయం 10.30 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X