కాలెండర్ పై దేశం వర్క్షాప్
హైదరాబాద్:తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలను ప్రణాళికాబద్దంగా ఏడాదికాడేది ముందుగానే నిర్ణయించుకోవాలని పార్టీ నాయకత్వం నిశ్చయించింది. ఇందుకుగానూ ప్రస్తుత మహానాడు నుంచి వచ్చే ఏడాది మహానాడు వరకు పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలను తేదీల వారిగా ఖరారు చేసి కాలెండర్ను రూపొందిస్తారు.
కాలెండర్ రూపకల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీయ పర్యవేక్షణలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాలెండర్కు సంబంధించిన బాధ్యతలు అప్పగించిన నాయకుల కోసం నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రెండు రోజుల వర్క్షాప్ నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు ఈ కాలెండర్ రూపకల్పనకు సంబంధించిన వ్యవహారాలపై చర్చలు జరుపుతున్నారు. విశాఖలో ఈ నెల 27న జరుగనున్న పార్టీ మహానాడులో ఈ కాలెండర్కు లాంఛనంగా ఆమోదం తెలపనున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.