వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 కోట్లతో బయోటెక్‌ ఫండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో బయోటెక్నాలజీ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. బయోటెక్నాలజీ పై రాష్ట్ర ప్రభుత్వ విధానం బయోటెక్‌ పాలసీ-2001ను సోమవారం నాడు ఆయన విడుదల చేశారు.

బయోటెక్‌ రంగం అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. నాలెడ్జ్‌ సొసైటీని స్థాపించే లక్ష్యంతో కృషి చేస్తున్న తమ ప్రభుత్వం ఐటిని ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేసిందని ఇప్పుడు బయోటెక్‌పై దృష్టి నిలిపిందని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, అడవులు, పర్యావరణం, వైద్య ఆరోగ్య రంగాల్లో బయోటెక్‌ డెవలప్‌మెంట్‌ వల్ల ఎన్నో మార్పులు వస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం ప్రకారం బయోటెక్నాలజీ సలహా సంఘాన్ని, బయోటెక్నాలజీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X