రైతు సమస్యలపై నినదించిన కాంగ్రెస్
విశాఖపట్నం : రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆందోళన నిర్వహించింది. రాస్తారోకోలు, ధర్నాలతో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాస్తారోకోలు ధర్నాలు నిర్వహించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, ఈ ప్రభుత్వాలు గద్దె దిగే వరకు విశ్రమించమంటూ కాంగ్రెస్ నేతలు ప్రతిన చేశారు.
విశాఖలో
ఎమ్మెస్సార్
అరెస్టు
విశాఖలో
రాస్తా
రోకో
జరుపుతున్న
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీ
అధ్యక్షుడు
ఎమ్.
సత్యనారాయణరావును
మంగళవారం
నాడు
అరెస్టు
చేశారు.
పిసిసి
పిలుపుమేరకు
మంగళవారం
నాడు
రైతు
సమస్యలపై
రాష్ట్రవ్యాప్తంగా
కాంగ్రెస్
రాస్తారోకోలు
నిర్వహించింది.
విశాఖపట్నంలో
కాంగ్రెస్
భారీ
ర్యాలీ
నిర్వహించింది.
అనంతరం
పిసిసి
అధ్యక్షుడు
సత్యనారాయణరావు
ఆధ్వర్యంలో
మద్దెనపాళెం
వద్ద
రాస్తారోకోకు
దిగటంతో
ట్రాఫిక్
స్ధంభించిపోయింది.
దీనితో, సత్యనారాయణరావుతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, వందలాదిమంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నాయకుల అరెస్టుతో రెచ్చిపోయిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బస్సుల అద్దాలను పగులగొట్టారు.
ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించేంతవరకూ తమ ఆందోళన ఆగదని ప్రకటించారు. ప్రభుత్వం ఉద్యమంపై నిర్భందం ప్రయోగిస్తే తాము ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఆయన హెచ్ఛరించారు.
పిజెఆర్,
సరోజిని
హల్
చల్
హైదరాబాద్
:
హైదరాబాద్లోకూడా
కాంగ్రెస్
పార్టీ
ఆధ్వర్యంలో
మంగళవారం
నాడు
రాస్తారోకో
జరిగింది.
సిడబ్ల్యూసి
సభ్యురాలు
సరోజనీ
పుల్లారెడ్డి,
మాజీ
సిఎల్పీ
నేత
పి.జనార్ధనరెడ్డిల
ఆధ్వర్యంలో
వందలాదిమంది
కాంగ్రెస్
కార్యకర్తలు
కోఠి
సెంటర్లో
రాస్తారోకో
నిర్వహించారు.
రోస్తారోకో వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తరోకోలు జరిగాయి.
కాగా, రైతుల సమస్యల పరిష్కారంకోసం తొమ్మిది కమ్యునిస్టు పార్టీలు కూడా రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాల వద్ద మంగళవారం పికెటింగ్లు నిర్వహించాయి.