తమిళనాట విజయ వీచికలు
చెన్నయ్ః తమిళనాట జయ ప్రభంజనంవీస్తున్నట్లు సర్వేలు ఢంకాబజాయించి చెబుతున్నాయి. తమిళనాడుఅసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం ప్రచారం పర్వం ముగిసింది. ప్రచారం చివరి రోజైన మంగళవారం నాడు జయలలిత చెన్నయ్ లో సుడిగాలి పర్యటన జరిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే డిఎంకె నేత కరుణానిధి ఆస్తులపైవిచారణ జరిపిస్తామని జయ ప్రకటించి సంచలనం సృష్టించారు. డిఎంకె ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుందని జయలలిత ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు జయకు అనుమతి నిరాకరించడంతో ఆమె పట్ల ప్రజల్లో ఆసక్తి మరింతగాపెరిగింది. ఆమె ప్రచార పర్వం మహా జోరుగా సాగింది. తమిళ ప్రజలు జయకు బ్రహ్మరథం పట్టారు. జయ సభలతో పోలిస్తే అధికార దర్పం వున్నప్పటికీ కరుణానిధి సభలుపేలవంగానే వున్నాయని చెప్పుకోవాలి. ఎఐఎడింఎంకె గెలుపొందితే ముఖ్యమంత్రి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈఅంశాన్ని ఓటర్ల మనసుల్లోకి ఎక్కించేందుకు డిఎంకెవిశ్వప్రయత్నాలు చేసింది.
జయ ప్రభంజనాన్ని డిఎంకె అడ్డుకోగలదా? ప్రతిసారీవిలక్షణమైన తీర్పు ఇచ్చే తమిళ ఓటర్లు ఈ సారి ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో పదోతేదీ జరిగే ఎన్నికల్లో మాత్రమే తేలుతుంది.